షాద్నగర్ నియోజకవర్గంలో సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మొగిలిగిద్ద నుంచి ఎల్లంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి టి స్కైలాబ్ బాబు పాల్గొన్నారు. ఎల్లంపల్లిలో రాజశేఖర్ కుల దురహంకార హత్యలో పోలీసుల పాత్రపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, కుల దురహంకార హత్యలను అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తేవాలన్నారు.