బనగానపల్లె: బనగానపల్లె మండలం లో అప్పు తిరిగి ఇవ్వమంటే ఓ వ్యక్తిపై కర్రలతో దాడి
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు బనగానపల్లె మండలం కైప గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుపై కర్రలతో దాడి చేసినట్లు ఎస్సై దుగ్గిరెడ్డి వెల్లడించారు. వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యశ్వంత్ కుటుంబానికి అప్పు ఇచ్చారు. తిరిగి ఇవ్వకపోవడంతో వెంకటేశ్వర్లు కుటుంబం కోర్టును ఆశ్రయించిందని, పగ పెంచుకున్న యశ్వంత్ కుటుంబ సభ్యులు ముగ్గురు కలిసి దాడి చేశారని వెల్లడించారు