నగరి: ప్రేమ పేరుతో యువతని మోసగించిన ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన గంగాధర్ నెల్లూరు సిఐ ప్రసాద్
చిత్తూరు మండలం జీడీనెల్లూరుకు చెందిన యువతి బీటెక్ చదివింది. ఆమెకు శివశంకర్(కడప) ఇన్స్టాగ్రాం ద్వారా పరిచయమయ్యాడు. ప్రేమగా మారడంతో అతడితో వెళ్లిపోయింది. తల్లిదండ్రులు తీసుకు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. 15రోజుల కిందట మరోసారి యువకుడితో వెళ్లిపోగా.. అతడికి మరికొందరితో సంబంధాలు ఉన్నట్లు గమనించింది. మోసపోయానని యువతి ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశామని GDనెల్లూరు ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు.