ముఠాలుగా ఏర్పడి ఆలయాలలో దొంగతనం చేస్తున్న ఐదుగురు సభ్యులు ముఠాను అరెస్టు చేసిన ప్రకాశం పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 11, 2026
యాంకర్ వాయిస్: ప్రకాశం జిల్లా పోలీసులు ఆలయాల్లో దొంగతనాలు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఐదుగురు అంతరాష్ట్ర ముద్దాయిలు. చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులు విలాసలకి సరిపోవటం లేదని, ఒక మూఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. జె.పంగులురు మండలం రామకూరు లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, రేణంగివరంలోని త్రిశక్తి పీటం గుడిలో ఈ ముఠా చోరీలు చేసిందని ఎస్పీ వెల్లడించారు. మదనపల్లిలో కూడా వీరు దొంగతనాలు చేశారన్నారు. నిందితుల నుంచి 4 లక్షల 70 వేల విలువైన.. ఏడు కేజీల వెండి, 19 గ్రాముల బంగారం స్వాధీనం