నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వర్షం ఎంతో ఊరటనిచ్చింది. మరోవైపు ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.