హనుమంతునిపాడు: కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకం జీవో ఫలితంగా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ ఆ జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో హనుమంతునిపాడులో బుధవారం దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ తీసుకువచ్చిన నూతన జీవో ఫలితంగా తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. వెంటనే జీవోను రద్దుచేసి ఉపాధి హామీ పథకం పేరు మార్చకుండా చూడాలన్నారు.