ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యత పథకాల అమలు జిల్లాలో సానుకూలత శాతాన్ని పెంపొందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్లో ఫిర్యాదుల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కొల్లబత్తుల కార్తీక్ డిఆర్ఓ రాము నాయక్ ఇతర జిల్లా అధికారులుపాల్గొన్నారు