అన్నమయ్య జిల్లా,రాయచోటి మండలంలోని వరిగ కురవపల్లి నుంచి వెంకటేష్ మరియు ఆవుల బలరాం అను ఇద్దరు అయ్యప్ప భక్తులు కఠోర దీక్ష తీసుకొని ఈరోజు ఉదయం 10 గంటలకు శబరిమలకు మహా పాదయాత్ర నిర్వహించారు.రాయచోటలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన వీరభద్రుడి ఆశీస్సులు అందుకొని మహా పాదయాత్రను ప్రారంభించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పాత్ర నిర్వహిస్తున్నామని,800 కిలోమీటర్లు 21 రోజులు పాదయాత్ర చేసి అయ్యప్ప స్వామి సన్నిధి అయిన శబరిమల చేరుకొని తమ ఇరుముడిని అయ్యప్ప స్వామికి సమర్పిస్తామని పాదయాత్ర నిర్వహించిన బలరాం మరియు వెంకటేష్ లు తెలిపారు