నంద్యాల అర్బన్: మహానంది మండలంలో భారీ గాలులు, 100 ఎకరాల్లో అరటి పంట నేలమట్టం
Nandyal Urban, Nandyal | Apr 22, 2026
నంద్యాల జిల్లా మహానంది మండలంలోని పలు గ్రామాల పరిధిలో భారీ గాలులు వీస్తున్నాయి. తిమ్మాపురం, బుక్కాపురం, కృష్ణనంది, గోపవరం, గాజులపల్లె పరిసరాల్లో రైతులు సాగు చేస్తున్న అరటి తోటల్లో చెట్లు నేలకొరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 100 ఎకరాల్లో అరటి చెట్లు పడిపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. అకాల వర్షానికి మొక్కజొన్న పంట తడిసి ముద్దవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.