రాజేంద్రనగర్ సీనియర్ నేత, ఉమ్మడి రంగారెడ్డి DCMS మాజీ ఛైర్మన్ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్, పెద్ద షాపూర్ మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్ తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్లో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వారికి సూచించారు. MLA సబిత రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.