కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ కాశీనాయన స్వామి ఆలయంలో శ్రీ కాశీనాయన స్వామి 30వ ఆరాధనోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కనిగిరి పట్టణంలోని భక్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు శ్రీ కాశీనాయన స్వామి ఆరాధన మహోత్సవానికి తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకులు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి.