చీమకుర్తి: పేకాట శిబిరంపై దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన చీమకుర్తి మండలం లక్ష్మీపురం సమీపంలోని పొలాల్లో ఆదివారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారాన్ని అందుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ సుధాకర్ ఎస్సై సుదర్శన్ తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.22,060 లు స్వాధీనం చేసుకున్నారు.