బనగానపల్లె: సంజామల మండలంలో ట్రాక్టర్ బోల్తా,యువకుడు దుర్మరణం
నంద్యాల జిల్లా సంజామల మండలం ముదిగేడు వద్ద సోమవారం ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి తాడిపత్రికి చెందిన లోకేశ్ మృతి చెందాడు. సాయి కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. తాడిపత్రి నుంచి కోవెలకుంట్లకు ఇటుకలు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.