అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని సాయి స్పోర్ట్స్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బంగారు బంగారు పతకాలు సాధించారు. సాయి తైక్వాండో అకాడమీ మేనేజర్ ఎస్.అంజుమ్, కోచ్ ఎస్.సానియా మంగళవారం తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరులో ఈ నెల 25, 26 తేదీలలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ఐ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో సాయి అకాడమీ క్రీడాకారులు ప్రతిభ కనబరచారన్నారు. 44 కిలోల విభాగంలో పి.పూజిత, 42 కిలోల విభాగంలో జి.కృష్ణ కీర్తనా, 40 కిలోల విభాగంలో ఎస్.కరిష్మా బంగారు పతకాలు సాధించారన్నారు.