మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ఆహార, వాణిజ్య పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. తుపాను ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో వరి పంట భారీగా దెబ్బతిన్నదని గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాల పరిధిలో 26 మండలాల్లో 33 శాతం మేర దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ యంత్రాంగాలు ఎన్యూమరేషన్ చెయ్యాలని కోరారు. అన్నమయ్య జిల్లాకు చెందిన 432 మంది రైతులకు చెందిన 590 ఎకరాల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయని, అందులో 575 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో వేరుశనగ, మూడు ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు తీ