ఆళ్లగడ్డ: సిరివెళ్లలో ఎస్సీ కాలనీలో అగ్నిప్రమాదం లో పశుగ్రాసం దగ్ధం
నంద్యాల జిల్లా సిరివెళ్ల మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం సాయంత్రం ఓ రైతుకు చెందిన గడ్డివాము అగ్నిప్రమాదంలో దగ్ధమైంది, అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియ రాలేదు, గమనించిన గ్రామస్తులు వెంటనే బిందెలు బకెట్లతో నీటిని తెచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు