మహేశ్వరం మండల కాంగ్రెస్ నాయకులతో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల విజయానికి ప్రతి కాంగ్రెస్ కార్య కర్త, నాయకులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలవాలని, కలసి కట్టుగా కృషి చేయాలని తెలిపారు.