అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని సంగమేశ్వర సర్కిల్ లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు యువకులకు గాయాలు
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగరంలోని సంగమేశ్వర సర్కిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలియజేశారు. ఈ ప్రమాదంలో ఖాసిం మరియు మహబూబ్ బాషా అనే ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.