ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో అమీలియో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గౌరు చరిత రెడ్డి నాయకత్వంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కంటి పరీక్షలు, షుగర్, బీపీ, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచిత మందులు, మాస్కులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.