పామూరు పట్టణంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రామాంజనేయులు ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ తొలి స్వాతంత్ర్య సంగ్రామంలో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు. భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను, మహిళల్లో పోరాట స్ఫూర్తిని ఝాన్సీ లక్ష్మీబాయి రేకెత్తించారన్నారు.