రైతులు ఉద్యాన పంటలు సరైన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టి పర్యవేక్షణ చేసినప్పుడే మేలైన నాణ్యమైన దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని కళ్యాణదుర్గం కె వి కె ఉద్యాన శాస్త్రవేత్త యుగంధర్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం సీర్పి గ్రామాల్లో మంగళవారం ఉద్యాన పంటలను మండల ఉద్యాన శాఖ అధికారి కృష్ణ తేజ తో కలిసి కళ్యాణదుర్గం కె.వి.కె శాస్త్రవేత్త యుగంధర్ పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు తెలియజేశారు. అనంతరం ఉద్యాన శాఖలో సబ్సిడీ పరికరాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు.