నిధుల వాడకంలో పారదర్శకత, సద్వినియోగం కనిపించాలి : ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 7, 2026
ప్రభుత్వం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా.. మనకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు జరుగుతున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని.. అధికారులకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు. మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అధ్యక్షతన బడ్జెట్ 2026-27 అవుట్రీచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జశ్వంత్ రావు, వైద్యం, విద్య, మెప్మా, ఐసీడీఎస్, రెవెన్యూ, డిఆర్డిఏతో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది నియోజకవర్గానికి నిధుల కేటాయింపుల గురించి ఎమ్మెల్యే వివరించారు.