మార్కాపురం జిల్లా దోర్నాల మండలం ఎడవల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కాకుండా అనేక హామీలను అమలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.