బనగానపల్లె: పెట్రోల్ పై అపోహలు వద్దు : బనగానపల్లె ఆర్ ఐ ప్రవీణ్ కుమార్
పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని RI ప్రవీణ్ కుమార్ సూచించారు.తహశీల్దార్ రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లెలోని 6 పెట్రోల్ బంకులను రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను పరిశీలించారు.కొరత లేకుండా సరఫరా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. నిల్వలు ఉన్నా అమ్మకాలు చేపట్టకుండా, బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.