రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకతాయిలు రోడ్డుపై హల్చల్ చేశారు. నంబర్ ప్లేట్లేని బైక్లలపై వచ్చిన ఆరుగురు యువకులు గుర్రాన్ని కర్రతో బాదుతూ ఈడ్చుకెళ్లారు. మూగ జీవిని హింసించడం, నడిరోడ్డు మీద అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతూ ఇతర వాహనదారులను భయభ్రాంతులకు గురి చేశారు. సదరు యువకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు.