ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒకేరోజు పేకాట ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు మరియు పోలీసులు
Ongole Urban, Prakasam | Apr 21, 2026
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పేకాట ఆడుతున్న 15 మందిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఏలూరిపాడులో 6 మందిని, మొగులూరులో 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 40 వేల నగదు, 8 ద్విచక్ర వాహనాలు, 15 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.