శ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి ఆశయాలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి: జిల్లా ఎస్పీ
Ongole Urban, Prakasam | Apr 11, 2026
విద్య ద్వారానే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరని ముందుగానే గుర్తించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారని జిల్లా ఎస్పీ అన్నారు. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా శనివారం ప్రకాశం జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులు కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శ్రీ జ్యోతిరావు పూలే గారు గొప్ప సంఘసంస్కర్తగా, సామాజిక తత్వవేత్తగా, మహిళా అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన ఆదర్శప్రాయుడని కొనియాడారు. సతీసహగమనం, అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు అన్నారు