అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని గ్రామాల్లో బుధవారం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని 93 శాతం పూర్తి చేపట్టడం జరిగిందని ఎంపీడీవో లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గ్రామాల్లో పింఛన్ల పంపిణీ అధికారులు స్థానిక టిడిపి నాయకులతో కలిసి ఉదయం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు 5650 మంది పింఛన్దారులకు గాను 5272 మందికి పంపిణి జరిగిందని ఎంపీడీవో పేర్కొన్నారు. బెలుగుప్పలు జరిగిన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో టిడిపి జిల్లా కార్యదర్శి మల్లికార్జున స్థానిక పింఛన్లు పంపిణీ అధికారులతో కలిసి పింఛన్లను పంపిణీ చేశారు.