కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ పనులను కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.80 లక్షల రూపాయల వ్యయంతో అప్పటి వైసిపి ప్రభుత్వం ఇందిరా కాలనీలో అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. కొంతమేర పనులు జరిగి , అధికారులు నిర్లక్ష్యం మూలంగా అసంపూర్తిగా అర్బన్ ఫ్యామిలీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి అన్నారు. వెంటనే అధికారులు స్పందించి, నిర్మాణాన్ని పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ డిమాండ్ చేశారు.