ఇటీవల జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, ఆర్టీసీ ట్రావెలింగ్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి పూట తిరిగే బస్సుల్లో భద్రతా చర్యలు, జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ సూచనలు చేశారు.వాహనాల పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు వంటి భద్రతా ప్రమాణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అవి సక్రమంగా లేని సందర్భాల్లో చర్యలు తీసుకుంటున్నారు.ఇక డ్రైవర్లలో నిద్రమత్తు తగ్గించేందుకు పోలీసులు “ఫ్రెష్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరక