అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం ఉరవకొండ వైసీపీ పిఎసి సభ్యులు వై.విశ్వేశ్వర్ రెడ్డి, యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు వై.ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు వివిధ మండలాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలతో నవయుగ ప్రజాఉద్యమంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అసెంబ్లీ పరిశీలకులు రమేష్ రెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డిలు పాల్గొని ప్రజలు చేసిన 65 వేల సంతకాల ప్రతుల బాక్స్ ల ప్రదర్శన ర్యాలీ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించారు.