మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కండ్లకోయ సంజన కోర్ట్ యార్డ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నినంటాయి. మహిళలకు ప్రత్యేకంగా రంగవల్లి పోటీలు నిర్వహించారు. మహిళలు ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు. సంప్రదాయాన్ని గౌరవిస్తూ పాలు పొంగించి ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు పాటలకు స్టెప్పులు వేస్తూ కైట్స్ ఎగరవేస్తూ సంబరాల్లో మునిగితేలారు. ముగ్గుల పోటీల్లో గెలిచిన వారికి ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు.