కనిగిరి పట్టణంలోని సర్కిల్ కార్యాలయం ఆవరణలో చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం కనిగిరిలో వారికి నడవడికపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ... ఇకమీదట ఎటువంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎటువంటి గొడవలుకు వివాదాల జోలికి వెళ్ళ వద్దన్నారు. ప్రవర్తనలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావు, ఎస్సై మాధవరావు పాల్గొన్నారు.