ఓర్వకల్లు పోలీస్స్టేషన్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం వార్షికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల స్థితి, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాపర్టీ కేసులు చేధించి రికవరీలు, విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని ఆదేశించారు. బాధితులకు న్యాయం చేయాలని, సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐలు చంద్రబాబు నాయుడు, గుణశేఖర్ బాబు ఉన్నారు.