నంద్యాల అర్బన్: ఓటర్ జాబితా సవరణ పై ప్రత్యేక దృష్టి : నంద్యాలలో మంత్రి ఫరూక్
Nandyal Urban, Nandyal | Jun 13, 2026
ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. నంద్యాల పార్టీ కార్యాలయంలో ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్పెషల్ ఇంటెన్స్ రివిజన్ ద్వారా ఓటర్ జాబితాలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని అర్హులైన ప్రతీ పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కార్యకర్తలతో మంత్రి భోజనం చేశారు.