ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఆక్వా రైతులు నిరసన, రొయ్యల ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు
Ongole Urban, Prakasam | May 12, 2026
ప్రకాశం జిల్లాలో రొయ్యల ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో జిల్లా రొయ్యల రైతుల సంఘాలు మండిపడుతున్నాయి. మంగళవారం కలెక్టరేట్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. ఏపీ ఎస్.ఎ.డి.ఎ అనుమతి లేకుండా ఫీడ్ ధరలు పెంచిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సరైన గిట్టుబాటు ధరలేక ఫీడ్ ఖర్చులు పెరిగి ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.