హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లా దేవరకొండకు అక్రమంగా సరఫరా అవుతున్న 1200 కేజీల బెల్లాన్ని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. బేగంబజార్ నుంచి బెల్లం తరలిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ సిబ్బంది దాడి నిర్వహించి, వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. వ్యాన్లో 1200 కేజీల బెల్లంతో పాటు 60 కేజీల అలమ్ను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.