ప్రకాశం జిల్లా తర్లపాడు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నీటి కోసం విద్యార్థులు అలమటి ఇస్తున్నారు. సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేయకపోవడంతో మండలంలోని 16 పంచాయతీల సర్పంచుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు వారాలుగా బుడ్డ పల్లి స్కూల్లో బోరు చెడిపోయి దాదాపు 85 మంది విద్యార్థులు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధనమ్మ విచారణ వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి సమస్యను తాత్కాలికంగా తీరుస్తున్నామని ఆమె అన్నారు.