శాంతిపురం మండలంలోని సంతూర్ వద్ద సోమవారం విద్యుత్ షాక్ తో చౌడంపల్లికి చెందిన పురుషోత్తం తీవ్రంగా గాయపడ్డాడు. పురుషోత్తం వీపు, కాలు కాలిపోవడంతో చికిత్స నిమిత్తం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. దండికుప్పం విద్యుత్ సబ్ స్టేషన్లో హెల్పర్ గా పనిచేస్తున్న పురుషోత్తం సంతూర్ వద్ద రైతులకు సంబంధించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు కనెక్షన్ ఇస్తుండగా, విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.