బక్రీద్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని :కొలిమిగుండ్ల సిఐ రమేష్ బాబు
నంద్యాల జిల్లాకొలిమిగుండ్ల మండలంలో బక్రీద్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఐ రమేష్ బాబు సూచించారు. బుధవారం సాయంత్రం పోలీస్ స్టేషన్లో హిందూ ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ బాబు, ఎస్సై నగీన పలు సూచనలు చేశారు. పండుగ రోజున వివాదాలకు తావు లేకుండా, అందరూ సోదరభావంతో మెలగాలని వారు కోరారు.