పెద చెర్లోపల్లి మండలంలోని వరిమడుగు గ్రామానికి చెందిన టిడిపి నేత వీరపనేని చెన్నకేశవులు హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన వరిమడుగు గ్రామానికి తీసుకురాగా, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం చెన్నకేశవులు పార్థివ దేహాన్ని దర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చెన్నకేశవులు టిడిపి బలోపేతానికి కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటుని ఎమ్మెల్యే అన్నారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం జరిగిన అంత్యక్రియలలో ఎమ్మెల్యే స్వయంగా పాల్గొన్నారు.