నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన ఆర్మీ జవాన్ మోముల వెంకట్ రెడ్డి అనారోగ్యానికి గురై మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య.. వెంకట్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాలలు వేసి పాడె మోశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.