ఉండి: గోస్త నదిలో పడి 7 ఏళ్ల బాలుడు గల్లంతు
పాలకోడేరు మండలం వేండ్ర శివారు కట్టవారిపాలెం చెందిన బొక్క శ్రీనివాస్ రావు రెండో కుమారుడు జైదేవ్ (7) గోస్త నదిలో పడి ఆదివారం గల్లంతయ్యాడు. పోలీసులు సోమవారం ఉదయం 10 గంటలకు తెలిపిన వివరాల ప్రకారం జైదేవ్ నవుడూరు లో ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి చదువుతున్నాడని ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితుడితో కలిసి సైకిల్ తొక్కుతూ గోస్త నది వంతెన మీదకు వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలుజారి పడి గల్లంతయ్యాడు అన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు