కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని గూబనపల్లి వద్ద ఆదివారం కారును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో హనుమంతరాయుడు, అన్నా చెల్లెలు శివకుమార్, చంద్రకళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ సోమవారం కళ్యాణదుర్గం ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ మృతదేహాల వద్ద నివాళులర్పించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అండగా ఉంటామని అధైర్య పడవద్దని భరోసా కల్పించారు.