కుందుర్పి మండలం కదరంపల్లిలో అంజన్ రెడ్డి అనే రైతుకు చెందిన వరిగడ్డి, వేరుశనగ పొట్టు వాములకు ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. మంటల్లో రెండు వాములు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనపై బాధిత రైతు అంజిన్ రెడ్డి పోలీసులుకు ఫిర్యాదు చేయడం జరిగింది. విచారించిన ఎస్సై మహేష్ సోమవారం గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.