ఒంగోలులో సందడి చేసిన మాజీమంత్రి అంబటి రాంబాబు, కూటమి ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని వెల్లడి
Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో మాజీ మంత్రి వైసిపి నేత అంబటి రాంబాబు సోమవారం సందడి చేశారు. వ్యక్తిగత పనులపై నెల్లూరు వైపు వెళ్తున్న అంబటి రాంబాబు.. ఒంగోలు నాయకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. కూటమి ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని మాజీ మంత్రి అన్నారు. ఇన్ ఛార్జ్ చుండూరు రవిబాబు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.