మిడ్జిల్: మేడ్చల్ మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ఆటో కింద పడి బాలుడు మృతి
ఫిల్టర్ వాటర్ పోయడానికివచ్చిన ఆటో ప్రమాదవశాత్తు బాలుడి పైనుండి పోవడంతో బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఫిల్టర్ వాటర్ పోయడానికి వెళ్లిన క్రమంలో ఓ ఇంటి వద్ద ఫిల్టర్ వాటర్ పోసి ఆటో రివర్స్ లో వెళ్తున్న క్రమంలో ఆటో వెనకాలే ఉన్న రెహాన్ అనే బాలుడు ఉన్నాడు. ఏది గమనించని ఆటో డ్రైవర్ వెనక్కి వెళ్లడంతో..ఆటో బాలుడి పైనుండి వెళ్ళింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఆడుకుంటూ ఉన్న కుమారుడు ఒక్కసారిగా మృతి చెందడంతో