సికింద్రాబాద్లోని యూనివర్సిటీ పీజీ కాలేజీ జ్ఞాన గంగోత్రి బాయ్స్ హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో హాస్టల్ సమస్యలపై ధర్నా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ తలారి గంగాధర్ హాస్టల్ సమస్యలపై వివరణ ఇవ్వడంతో హాస్టల్ విద్యార్థులు ధర్నా విరమించారు. బేగంపేట్ సీఐ సైదులు విద్యార్థులతో మాట్లాడారు. అసిస్టెంట్ రిజిస్టర్ జ్ఞానేశ్వర్, హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, శంకర్ తదితరులు ఉన్నారు