కనిగిరి: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కనిగిరి సీఐ శ్రీనివాసులు సూచించారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తుపదార్థాలు వినియోగించవద్దని యువతకు సిఐ శ్రీనివాసులు కనిగిరిలో బుధవారం అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్ధాలను యువతకు సీఐ వివరించారు. మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు నాశనం అవుతాయని, వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు. ఎక్కడైనా గంజాయి వంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే, ఆ సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలని సిఐ సూచించారు.