నందికోట్కూరు: నీటి సమస్యను తీర్చేందుకే పైపులైన్ పనులు, నందికొట్కూరుమున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో త్రాగినీటి సమస్య తీర్చేందుకే త్రాగునీటి పైపులైన్లు వేస్తున్నట్లు పట్టణ మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలో పలు కాలనీలు హాజీనగర్, సాయిబాబా పేట,బాల వెంకట గోడౌన్ వెనుక భాగం, హౌసింగ్ బోర్డు గ్యాస్ ఆఫీస్ లైన్ లో కొన్ని లైన్లకు నూతనంగా బోర్ కనెక్షన్ ఇస్తున్న వాటి పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ పైపులైన్లు వేయటం వల్ల కాలానీల్లో నీటి సమస్య తీరుతుందని పట్టణంలో వేసవి కాలంలో అన్ని కాలనీలో నీళ్లు సమృద్ధిగా సరఫరా అయ్యేలా చూడాలని డిఈ నాసిర్,అసిస్టెంట్ ఇంజనీర్ దినేష్ కుమార్ లను కమిషనర్ ఆదేశించారు.కుళాయిలకు నీటి సరఫరా చ